
By - Chitralekha |23 Aug 2023 12:15 PM IST
విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి సచివాలయం పరిధి రౌతులపాలెంలో వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మోపాడ ఆదినారాయణపై సర్పంచ్ అనుచరులు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. 'స్పందన'లో సర్పంచ్ కుమారుడి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసినందుకు రెక్కీ నిర్వహించి దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు సర్పంచ్ కుమారుడి పేరిట నమోదు చేసుకున్నారని ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. దాడికి ప్రోత్సహించిన కోన రమణతో పాటు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com