విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం వెలుగులోకి వచ్చింది. కనిమెళ్ల గ్రామంలో నివసిస్తున్న రామారావు, సూరమ్మ దంపతులకు చెందిన ఇంటిని కొత్త సచివాలయ నిర్మాణానికి ఇవ్వాలని వైసీపీ నేతలు, అధికారులు కోరారు. వేరే చోట ఇల్లు నిర్మించి ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. దీంతో ఆ వృద్ధులు తమ ఇంటిని సచివాలయ నిర్మాణానికి ఇచ్చారు. అయితే.. మూడున్నరేళ్లైనా హామీ నెరవేర్చలేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్నారు. అధికారులకు ఎన్ని దరఖాస్తులు చేసినా ఫలితం లేకపోవడంతో వారు టీవీ5ని ఆశ్రయించారు.

Next Story