
ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా చెట్లు నరకడం, ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం పర్యటన ప్రభావం విద్యావ్యవస్థపై కూడా పడింది. జగన్ పర్యటన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జగన్ వస్తుండగా ఆ సభకు జనసమీకరణ కోసం ప్రైవేట్ పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకుని సెలవు ఇచ్చారు. DEO సెలవు ప్రకటించడంపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు సత్యసాయి బాబా ఫ్లెక్సీలపైకి ఎక్కి పార్టీ జెండాలు కట్టారు. పట్టణంలో సీఎం పర్యటన లేనప్పటికీ సత్యసాయి బాబా ఫ్లెక్సీలు తీసివేసి వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలు కట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పార్టీ జెండాలపై నిషేధం ఉన్నా..అధికారి పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com