YCP MLA: ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో...

YCP MLA: ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో...

YSR జిల్లా ప్రొద్దుటూరు సెబ్ ఎస్సై అలీబేగ్ ని..... MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ప్రొద్దుటూరుకి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి.. పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకెళ్తుండగా.... ఎస్ ఈబీ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించిన పోలీసులు.. సంతకం పెట్టాలని కోరగా పుల్లయ్య నిరాకరించారు. ఇదితెలిసి స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు..కుర్చీలో కూర్చుని ఎస్సై బేగ్ పై విరుచుకుపడ్డారు. తల్లి చనిపోయి... దినం కోసం మందు బాటిల్లు తీసుకెళ్తుంటే..కేసు పెడతావా అని ప్రశ్నించారు. కేసు నమోదుచేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని బేగ్ చెబుతున్నా MLA పట్టించుకోలేదు. ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో.... అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు పెడితే ఒప్పుకోబోనన్న ఆయన...... చట్టాన్ని మార్చుకో లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story