AP: అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి గళం

AP: అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి గళం

నిధులు రాక అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. బతిమలాడి పనులు చేయించినా బిల్లులు రాక తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జి.కొండూరు మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాదర్‌... గుత్తేదారులు బిల్లులు రాక తన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మైలవరంలో ఒక నాయకుడు రూ.కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో మామిడితోటను కూడా అమ్మేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్లుగా ఉండాల్సిన అభివృద్ధి, సంక్షేమంలో ఒంటి కంటి చూపు ఇబ్బందికరమని ఆయనమ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడంతో, అభివృద్ధికి నిధులు తేవడానికి నానా తిప్పలూ పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.

Next Story