
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..... ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా..... వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ట్విటర్ ఎక్స్ ఖాతాలో బాలశౌరి వెల్లడించారు. అలాగే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఎక్స్ వేదికగా తెలియచేశారు. మచిలీపట్నం MLA పేర్ని నానితో పాటు పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్తోనూ ఎంపీ బాలశౌరికి రాజకీయంగా విభేధాలున్నాయి. తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని పేర్ని నానిపై బాలశౌరి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం...... లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్లను మార్పు చేస్తుండటంతో బాలశౌరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com