తిరుపతి జిల్లాలో వాలంటీర్ దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి మండలం కల్రోడ్పల్లి దళితవాడలో స్థలం కబ్జాకు యత్నించాడు. దీంతో అడ్డుకున్న దంపతులపై దాడికి తెగబడ్డాడు. అధికారులతో కుమ్మక్కై వాలంటీర్ గౌతమ్రావు పొజిషన్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కేటాయించిన స్థలంలో.. రేకుల షెడ్ వేస్తుండగా దంపతులు రామకృష్ణ, ఈశ్వరి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాలంటీర్ దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ వల్ల తమకు ప్రాణభయం ఉందని కంప్లైంట్ చేశారు. వీఆర్వోతో కలిసి వాలంటీర్ కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. అయితే.. గ్రామస్తులను విచారించే తాను వాలంటీర్కు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చానని వీఆర్వో వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ స్థలానికి సంబంధించి రామకృష్ణ, ఈశ్వరి దంపతులు తమకు జనవరిలో వినతి పత్రాలు ఇచ్చారని.. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com