SHARMILA: జగన్‌కు షర్మిల లేఖాస్త్రం

SHARMILA: జగన్‌కు షర్మిల లేఖాస్త్రం

ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ కు బహిరంగ లేఖ రాసిన షర్మిల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారిమళ్లింపు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం, ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారని స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని ఇది వివక్ష కాదా? అని లేఖలో ప్రస్తావించారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎంఎల్ సీని ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న " నవ సందేహాలకు " సమాధానం చెప్పాలని లేఖలో షర్మిల డిమాండ్ చేశారు.

Next Story