By - Sathwik |13 Oct 2023 4:30 AM GMT
కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన YSR సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లు దర్శనమిచ్చాయి. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో మహిళలు మండిపడుతున్నారు. గూడూరు గ్రామంలో మరో ఇద్దరికి పురుగుల ఖర్జూరాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని తెలిపారు. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై సీడీపీవో గ్లోరిని వివరణ కోరగా కేవలం ఒకరిద్దరికి ఇచ్చిన ఖర్జూరే పాడైనట్లు తెలిసిందని, వెంటనే వారికి కొత్తవి ఇచ్చామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com