By - Vijayanand |14 April 2023 11:07 AM GMT
రంపచోడవరం ఎమ్మెల్యేకు నాగులపల్లి ధనలక్ష్మికి ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది.అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు ఆదివాసీలు.బోయ వాల్మీకి,బొంతు ఒరియా కులాలను ఎస్టీల్లో కలపడాన్ని ఆపాలంటూ నిరసనకు దిగారు. దీనికి సంబందించిన జీవో నెంబర్ 52 రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com