Bandi Sanjay: "దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర"

Bandi Sanjay: దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర

దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన.. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్నారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు.

Next Story