By - Vijayanand |5 Aug 2023 10:56 AM GMT
ఏపీ గుండా రాజ్యంగా మారిందన్నారు టీడీపీ నేతలు. పుంగనూరు, తంబళ్లపల్లె దాడులపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన వీడియో, ఫోటోలను గవర్నర్కు అందజేశారు. వీరిలో నిమ్మల రామానాయుడు, బోండా ఉమ,గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్బాబు ఉన్నారు.
ప్రతిపక్ష నేతను అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్ రాజకీయం చేస్తున్నారని,గతంలో చంద్రబాబు ఇంటి, బస్సుపై దాడి చేశారని మండిపడ్డారు.టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగితే జగన్ సహా పోలీసులు సమర్థించుకున్నారని అన్నారు.చంద్రబాబు 2500 కిలోమీటర్లు పర్యటిస్తుంటే దారిలో వైసీపీ నేతలను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com