Nandyal: టీడీపీలో చేరనున్న సీనియర్‌ న్యాయవాది తులసీ రెడ్డి

Nandyal: టీడీపీలో చేరనున్న సీనియర్‌ న్యాయవాది తులసీ రెడ్డి

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వైసీపీని వీడిటీడీపీలో చేరనున్నారు సీనియర్‌ న్యాయవాది తులసిరెడ్డి. ఆయనతో పాటు దాదాపు 3వేల అనుచరులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. భారీ కాన్వాయ్‌తో నంద్యాల నుంచి బయలుదేరి కావలి టీడీపీ క్యాంపుకు బయలుదేరారు వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు. యువనేత నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

Next Story