
By - Vijayanand |10 Aug 2023 5:32 PM IST
ఏపీ వైసీపీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిడిగల్లు సబ్ స్టేషన్ ఆపరేటర్ బెల్లంకొండ శ్రీనివాసులు పై నిడిగల్లు వైసీపీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు రెడ్డి దాడికి పాల్పడ్డాడు. పై అధికారుల ఆదేశాలతో ఆపరేటర్ శ్రీనివాసులు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. నా గ్రామంలో కరెంటు ఆపుతావా అంటూ మద్యం మత్తులో ఆపరేటర్ శ్రీనివాసులపై దాడి చేశాడు. అనంతరం సబ్ స్టేషన్కు తాళాలు వేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com