వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత క్యాడర్ తిరుగుబాటు

వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత క్యాడర్ తిరుగుబాటు


వైసీపీ మంత్రులు, ఎమ్యెల్యేలపై ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు మొదలెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి పెద్ద అవినీతిపరడంటూ సొంత పార్టీకి చెందిన ఎంపీపీ కవిత విజయ్ రంగే గౌడ్ ఆరోపించింది. ఎమ్మెల్యే అక్రమాలపై సీబీఐ, సీఐడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి నుండి తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. అంగన్వాడి ఉద్యోగాల్లో ఎమ్మెల్యే లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఉద్యోగం ఇచ్చారని వైసీపీ ఎంపీపీ తెలిపింది.

Next Story