By - Vijayanand |15 April 2023 11:03 AM GMT
గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్స్టేషన్లో వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నారా లోకేష్పై వైసీపీ సోషల్ మీడియా, సాక్షిలో అసత్య ప్రచారాలు చేసారని ఫిర్యాదు చేశారు. తమ యువనేత అనని మాటలను అన్నట్లుగా మార్ఫింగ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ఛానల్ అసత్య ప్రచారాలు మానుకోకపోతే.. రాబోయే రోజుల్లో ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com