
By - Vijayanand |8 Aug 2023 12:45 PM IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుోతంది. ఇవాల్టితో పాదయాత్ర 178వ రోజుకు చేరింది. ఇప్పటివరకు లోకేష్ 2354 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ జూలకల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం పందిటివారిపాలెం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. భోజన విరామం అనంతరం జూనపాడు నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు పిడుగురాళ్ల కన్యాకపరమేశ్వరి గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com