Yuvagalam: గుంటూరులో 'యువగళం' విజయోత్సవ ర్యాలీ

Yuvagalam: గుంటూరులో యువగళం విజయోత్సవ ర్యాలీ

యువగళం పాదయాత్రలో... లోకేష్ 2000 కిలోమీటర్ల మైలురాయి దాటడంతో.. గుంటూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చంద్రమౌళి నగర్‌ కూడలి ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి లాడ్జ్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తెలుగు దేశం పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్‌ కోవెలమూడి రవీందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర జనప్రభంజనంతో.. ముందుకు సాగుతోందన్నారు కోవెలమూడి రవీందర్. నవరరత్నాల పేరుతో.. నవ మోసాలు చేస్తున్న సైకో సీఎం జగన్‌కు జనం బుద్ది చెబుతారన్నారు.

Next Story