లోకేష్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చిన జనం

లోకేష్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చిన జనం

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 189వ రోజు లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్‌కు మద్దతుగా యువగళానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా లోకేష్‌కు స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్‌ కలిసిన వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. హైస్కూల్ రోడ్, ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకిల మీదుగా యాత్ర సాగనుంది. నిడమానూరు దగ్గర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. రాత్రికి నిడమానూరులో లోకేష్‌ బస చేస్తారు. దాదాపు 15 కిలో మీటర్లపైనే అర్ధరాత్రి వరకు పాదయాత్ర సాగనుంది.

Next Story