WIN: తిలక్ వర్మ తాండవం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న భారత్కి విజయాన్ని అందించాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ తిలక్ వీరోచిత పోరాటం కనబరిచాడు. తిలక్ వర్మతో పాటు సుందర్(26 ) రాణించాడు. తెలుగు తేజం తిలక్ వర్మ ఇంగ్లండ్ బౌలర్లను చెండాడుతూ ఒంటిచేత్తో భారత జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఓ దశలో గెలుపు కష్టమేననిపించినా, ఒత్తిడికి లోనుకాని అతడి ఆటతీరుతో ఆఖరి ఓవర్లో భారత్ ఊపిరిపీల్చుకుంది. గెలుపు దరిదాపుల్లోకి వచ్చిన పర్యాటక జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ముందు గా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బట్లర్ (45), కార్స్ (31), జేమీ స్మిత్ (22) రాణించారు. అక్షర్, వరుణ్కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 రన్స్ చేసి గెలిచింది. కార్స్కు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా తిలక్ నిలిచాడు. మూడో టీ20 మంగళవారం రాజ్కోట్లో జరుగుతుంది.
తడబడ్డ బ్రిటీష్ బ్యాటర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తన బలహీనతను మరోసారి ఇంగ్లాండ్ బయట పెట్టుకుంది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ దశలో మరోసారి హారీ బ్రూక్ తో కలిసి బట్లర్ సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ వికెట్లు పడినా కూడా ఎదురు దాడికి బౌండరీలు సాధించారు. దీంతో మూడో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరూ ఔటయ్యాక తొలి టీ20 తర్వాత జట్టులోకి వచ్చిన బ్రైడెన్ కార్స్ మరోసారి తన ఆల్ రౌండ్ విలువను చాటి చెప్పాడు. తన స్ఫూర్తితోనే ఇంగ్లాండ్ 160 పరగుల మార్కును చేరుకోగలగింది. కార్స్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ బౌలింగ్ లో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదడంతో అప్పటివరకు స్థబ్దుగా సాగిన స్కోరు బోర్డు ఉరకలెత్తింది. దీంతో ఇంగ్లాండ్ సవాలు విసరగలిగే స్కోరును సాధించింది.
కష్టంగా టీమిండియా
చెన్నై పిచ్ పై 165 పరుగుల స్కోరును ఛేదించడం తేలిగ్గానే కనిపించింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ వర్మ (12)ను మార్క్ వుడ్ ఇలాగే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (5) ఫుల్ షాట్ ఆడి పెవిలియన్ కు చేరాడు. దీంతో 19 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను భారత్ కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ (12), ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) కూడా త్వరగానే ఔటవడంతో భారత్ కు ఓటమి తప్పదనిపించింది. కానీ తిలక్ అద్భుతం చేశాడు. లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి భారత్కు విజయాన్ని అందించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్
ఉత్కంఠగా జరిగిన రెండో 20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ గెలుపు కీలక పాత్ర పోషించిన తెలుగోడు తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com