'ఆర్సిబిపై కేసు పెట్టాలి': విరాట్ ని విమర్శించిన 1983 ప్రపంచ కప్ విజేత..

ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. జూన్ 3న అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సిబి టైటిల్ దక్కించుకుంది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) బుధవారం బెంగళూరులో ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. తమ అభిమాన క్రికెటర్ ను చూడాలనే ఆశతో వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు.
అయితే, జనం భారీ సంఖ్యలో గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో భయాందోళనలు, గందరగోళం నెలకొంది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం బౌరింగ్ హాస్పిటల్, వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు.
"ప్రజలు దీన్ని మరచిపోలేరు. బయట ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, లోపల వేడుక జరుగుతోంది. ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదకరమైన ప్రమాదానికి మృతుల కుటుంబాలు RCB మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ₹100 కోట్లకు దావా వేయాలి.. BCCI కూడా బాధ్యత లేనట్లు ప్రవర్తించకూడదు" బాధ్యత వహించాలి అని భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు.
ఈ ఘటన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఏర్పాట్లను సమర్థిస్తూ, "మేము 5,000 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసాము. ఇంత యువ, ఉత్సాహభరితమైన జనసమూహంపై మేము బలవంతంగా అధికారాన్ని ప్రయోగించలేకపోయాము" అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com