ACA: ఏసీఏ ప్రెసిడెంట్‌గా కేశినేని చిన్ని

ACA: ఏసీఏ ప్రెసిడెంట్‌గా కేశినేని చిన్ని
X
ఏకగ్రీవంగా ఎన్నికైన విజయవాడ ఎంపీ... ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్‌బాబు... 34మందితో నూతన కమిటీ ఎంపిక

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ అధ్య­క్షు­డి­గా మరో­సా­రి వి­జ­య­వాడ ఎంపీ కే­శి­నే­ని శి­వ­నా­థ్ ఎన్ని­క­య్యా­రు. సర్వ­స­భ్య సమా­వే­శం­లో సంఘ సభ్యు­లం­తా చి­న్ని­ని ప్రె­సి­డెం­ట్‌­గా ప్ర­తి­పా­దిం­చా­రు. అయి­తే, ఎలాం­టి పోటీ లే­క­పో­వ­డం­తో ఆయనే మరో­సా­రి ఆం­ధ్ర క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్‌­కు అధ్య­క్షు­డి­గా ఏక­గ్రీ­వం­గా ఎన్ని­క­య్యా­రు. అనం­త­రం ACA ఎన్ని­కల అధి­కా­రి ని­మ్మ­గ­డ్డ రమే­ష్ కు­మా­ర్ ఆయ­న­కు ఎన్నిక ధృ­వీ­క­రణ పత్రా­న్ని అం­ద­జే­శా­రు. ఏసీఏ కా­ర్య­ద­ర్శి­గా రా­జ్య­సభ సభ్యు­డు సానా సతీ­శ్ బాబు.. మరో 34 మం­ది­తో ఆం­ధ్ర క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ నూతన కమి­టీ ఏర్పా­టైం­ది. . ఈ సం­ద­ర్భం­గా ఏసీఏ అధ్య­క్షు­డు, ఎంపీ కే­శి­నే­ని చి­న్ని మా­ట్లా­డు­తూ.. ఏసీఏ నూతన కా­ర్య­వ­ర్గం ఎన్ని­కైం­ది.. మూ­డే­ళ్ల­ల్లో రా­ష్ట్రం­లో క్రి­కె­ట్ అభి­వృ­ద్ధి­కి కృషి చే­స్తాం అన్నా­రు.. మౌ­లిక సదు­పా­యా­లు కల్పిం­చి జా­తీయ, అం­త­ర్జా­తీయ క్రీ­డా­కా­రు­లు­గా తీ­ర్చి­ది­ద్దు­తాం.. ఎక్కువ మంది క్రీ­డా­కా­రు­ల­ను తయా­రు చే­స్తాం.. ఐపీ­ఎ­ల్‌ తర­హా­లో ఏపీ­ఎ­ల్‌ ని­ర్వ­హి­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.. అసో­సి­యే­ష­న్ ప్ర­తి­ష్ట పెం­చే­లా మేం పని­చే­స్తా­మ­ని తె­లి­పా­రు. మరో­వై­పు ఏసీఏ కా­ర్య­ద­ర్శి సానా సతీ­ష్ మా­ట్లా­డు­తూ.. 2025-28 కాల పరి­మి­తి­కి ఏసీఏ ఎన్నిక జరి­గిం­ది.. ఒక్క వైస్ ప్రె­సి­డెం­ట్ మి­న­హా అం­ద­రూ ఏక­గ్రీ­వం­గా ఎన్నిక అయ్యా­ర­ని వె­ల్ల­డిం­చా­రు.. గత 11 నె­ల­లు­గా ఎఫె­క్స్ కమి­టీ సహ­కా­రం­తో బాగా పని చే­శా­రు.. వి­శాఖ స్టే­డి­యం అభి­వృ­ద్ధి, ఏపీ­ఎ­ల్‌ టో­ర్నీల ని­ర్వ­హణ సమ­ర్థ­వం­తం­గా సా­గిం­ది.. ఇరవై లక్షల నుం­చి నలభై లక్ష­ల­కు జి­ల్లా అసో­సి­యే­ష­న్లు పెం­చాం.. కొం­త­మం­ది క్రీ­డా­కా­రు­ల­ను ఇం­గ్లాం­డ్ పం­పా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.. రెడ్ బాల్, వైట్ బాల్ ఆట వల్ల క్రీ­డా­కా­రు­లు కొంత గం­ద­ర­గో­ళం­లో ఉన్నా­రు.. ఇది గు­ర్తిం­చి వే­ర్వే­రు­గా క్రీ­డా­కా­రు­ల­కు శి­క్షణ ఇస్తు­న్నాం అన్నా­రు..

కొత్తగా మరో క్రికెట్ స్టేడియం

ఏపీ­లో క్రీ­డా­భి­వృ­ద్ధి­కి ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం ప్రా­ధా­న్యం ఇస్తోం­ది. గ్రా­మీణ ప్రాం­తా­ల్లో­ని యు­వ­త­లో దా­గు­న్న క్రీ­డా నై­పు­ణ్యా­ల­ను వె­లి­కి తీసి.. జా­తీయ, అం­త­ర్జా­తీయ క్రీ­డా­కా­రు­లు­గా తీ­ర్చి­ది­ద్దే­లా అడు­గు­లు వే­స్తోం­ది. క్రీ­డా­కా­రు­ల­ను ప్రో­త్స­హిం­చా­ల­నే ఉద్దే­శం­తో ఉద్యో­గా­ల్లో స్పో­ర్ట్స్ కోటా వా­టా­ను కూడా ఏపీ ప్ర­భు­త్వం పెం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఇదే క్ర­మం­లో క్రీ­డా­కా­రు­లు, గ్రా­మీణ యువత కోసం ప్ర­తి ని­యో­జ­క­వ­ర్గం­లో స్టే­డి­యం ని­ర్మిం­చే ఆలో­చ­న­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం ఉంది. ఏపీ పరి­శ్ర­మల శాఖ మం­త్రి టీజీ భరత్ ఈ వి­ష­యా­న్ని వె­ల్ల­డిం­చా­రు. రా­ష్ట్రం­లో­ని ప్ర­తి ని­యో­జ­క­వ­ర్గం­లో స్టే­డి­యం ని­ర్మిం­చా­ల­నే­దే రా­ష్ట్ర ప్ర­భు­త్వం లక్ష్య­మ­ని మం­త్రి టీజీ భరత్ తె­లి­పా­రు. ఈ క్ర­మం­లో­నే కర్నూ­లు­లో క్రి­కె­ట్ స్టే­డి­యం అభి­వృ­ద్ధి చే­సేం­దు­కు చర్య­లు చే­ప­ట్టి­న­ట్లు వి­వ­రిం­చా­రు.

Tags

Next Story