U-19 WC: యువ భారత జట్టుపై ప్రశంసల జల్లు

U-19 WC: యువ భారత జట్టుపై ప్రశంసల జల్లు
X
మనమ్మాయిలు అదరగొట్టారన్న ప్రముఖులు... అజేయంగా నిలిచి కప్పు సాధించడంపై హర్షం

అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచిన మహిళల క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. తన X అకౌంట్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 'వాంఖడేలో ఇంగ్లండ్ చాలా కష్టతరమైన రోజును ఎదుర్కొంది. కానీ మా జట్టు మరింత బలంగా తిరిగి వస్తుందని నాకు తెలుసు. విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు. మ్యాచ్‌కు ముందు జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్‌లను కలవడం ఆనందంగా ఉంది. మా మామ గారితో కలిసి క్రికెట్ చూడడం చాలా ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు.

ఆడ బిడ్డలు అదరగొట్టారు: కిషన్ రెడ్డి

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు హార్దిక అభినందనలు తెలిపారు. ‘ మీ విజయం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణం, క్రికెట్‌ను భవిష్యత్తుగా ఎంచుకున్న యువతకు స్ఫూర్తిదాయకం. ఈ గొప్ప విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆల్‌రౌండర్ తెలుగమ్మాయి గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు. దేశ అభివృద్ధిలో ముందుకు సాగుతున్న ఆడ బిడ్డలు ప్రపంచ కప్ గెలుచుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది’ అని ట్వీట్ చేశారు.

హోంమంత్రి అభినందనలు

అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని అభినందించారు. ఈ విజయం మరెంతో మందికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నా.. జైహింద్ అని ట్వీట్ చేశారు.

టీమిండియాకు క‌విత అభినంద‌న‌లు

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల అండర్-19 జట్టుకు ఎమ్మెల్సీ క‌విత అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ బిడ్డ గొంగ‌డి త్రిష‌పై ప్ర‌త్యేక ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ ఆమె అద్భుతంగా రాణించారని కొనియాడారు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా, ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన త్రిష‌కు ప్ర‌త్యేక అభినందనలు తెలిపారు. దేశానికి మ‌రోసారి టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.

Tags

Next Story