ASIA CUP: ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్

ASIA CUP: ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్
X
ఆసి­యా కప్ ఎడి­ష­న్‌­లో 300 పరు­గు­లు చే­సిన తొలి ప్లే­య­ర్‌­గా ఘనత

ఆసి­యా కప్‌­లో సం­చ­లన ప్ర­ద­ర్శన చే­స్తు­న్న టీ­మిం­డి­యా ఓపె­న­ర్ అభి­షే­క్ శర్మ అరు­దైన రి­కా­ర్డు­ను నె­ల­కొ­ల్పా­డు. టీ20 ఆసి­యా కప్ ఎడి­ష­న్‌­లో 300 పరు­గు­లు చే­సిన తొలి ప్లే­య­ర్‌­గా ఘనత సా­ధిం­చా­డు. మొ­త్తం­గా 6 మ్యా­చ్‌­ల్లో 309 రన్స్ చే­శా­డు. ఇం­త­కు­ముం­దు పా­కి­స్తా­న్ ప్లే­య­ర్ మహ్మ­ద్ రి­జ్వా­న్ 2022లో 281 రన్స్ చే­శా­డు. తా­జా­గా అభి­షే­క్ అత­న్ని వె­న­క్కి­నె­ట్టి టాప్ స్కో­ర­ర్‌­గా ని­లి­చా­డు. అలా­గే, ఓ టీ20 టో­ర్నీ లేదా సి­రీ­స్‌­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన క్రి­కె­ట­ర్ల జా­బి­తా­లో అభి­షే­క్‌‌ 5వ స్థా­నం­లో ని­లి­చా­డు. ఈ జా­బి­తా­లో ఇం­గ్లాం­డ్ ఆట­గా­డు ఫిల్ సా­ల్ట్(331, వె­స్టిం­డీ­స్‌­పై) అగ్ర­స్థా­నం­లో ఉన్నా­డు. ఇక, టీ20 ఆసి­యా కప్‌­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన క్రి­కె­ట­ర్ల జా­బి­తా­లో వి­రా­ట్ కో­హ్లీ, అఫ్గా­న్ ప్లే­య­ర్ ఇబ్ర­హీం జద్రా­న్ చెరో 196 రన్స్‌­తో సం­యు­క్తం­గా మూడో స్థా­నం­లో ఉన్నా­రు. అలా­గే, ఇప్ప­టి­కే వరు­స­గా రెం­డు హాఫ్ సెం­చ­రీ­లు బా­దిన అభి­షే­క్ శ్రీ­లం­క­పై మూడో అర్ధ శతకం నమో­దు చే­శా­డు.

తొలిసారి దాయాదితో ఫైనల్ ఫైట్

ఆసి­యా కప్లో తు­ది­పో­రు­లో దా­యా­దు­లు అమీ­తు­మీ తే­ల్చు­కో­ను­న్నా­యి. సె­ప్టెం­బ­ర్ 28వ తే­దీన జరి­గే ఫై­న­ల్ మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా, పా­కి­స్థా­న్ జట్లు తల­ప­డ­ను­న్నా­యి. 41 ఏళ్ల ఆసి­యా­క­ప్ చరి­త్ర­లో ఈ రెం­డు జట్లు ఫై­న­ల్లో తల­ప­డ­టం ఇదే తొ­లి­సా­రి. గ్రూ­ప్ దశలో దా­యా­ది పా­కి­స్థా­న్‌­పై వరు­స­గా రెం­డు వి­జ­యా­లు సా­ధిం­చిన భా­ర­త్.. అదే జోరు కొ­న­సా­గిం­చా­ల­ని భా­వి­స్తోం­ది. చి­వ­రి మ్యా­చ్‌­లో బం­గ్లా­పై వి­క్ట­రీ కొ­ట్టిన పాక్.. పూ­ర్తి ఆత్మ­వి­శ్వా­సం­తో బరి­లో­కి ది­గ­నుం­ది. ఈ మ్యా­చ్ కోసం అభి­మా­ను­లు ఎదు­రు­చూ­స్తు­న్నా­రు.

సూర్య మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత

ఆసి­యా కప్‌­లో భా­గం­గా గ్రూ­ప్‌ స్టే­జి­లో పా­కి­స్థా­న్‌­తో జరి­గిన మ్యా­చ్‌­లో టీ­మ్‌­ఇం­డి­యా వి­జ­యం సా­ధిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ మ్యా­చ్‌ అనం­త­రం టీ­మ్‌­ఇం­డి­యా టీ20 కె­ప్టె­న్‌ సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ చే­సిన వ్యా­ఖ్య­ల­పై పీ­సీ­బీ ఫి­ర్యా­దు చే­సిం­ది. దీం­తో ఐసీ­సీ.. సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ మ్యా­చ్‌ ఫీ­జు­లో 30 శాతం కోత వి­ధి­స్తూ చర్య­లు తీ­సు­కుం­ది. సె­ప్టెం­బ­ర్‌ 14న మ్యా­చ్‌ అనం­త­రం సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ మా­ట్లా­డు­తూ.. టీ­మ్‌­ఇం­డి­యా పా­కి­స్థా­న్‌­పై సా­ధిం­చిన వి­జ­యా­న్ని ఫహ­ల్గాం ఉగ్ర­దా­డి బా­ధి­తు­లు, భారత సై­ని­కు­ల­కు అం­కి­త­మి­స్తు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­డు. అయి­తే అతడు మ్యా­చ్‌­లో రా­జ­కీయ ప్ర­సం­గా­లు చే­శా­డ­ని ఆరో­పి­స్తూ.. పా­కి­స్థా­న్‌ క్రి­కె­ట్‌ బో­ర్డ్‌ ఐసీ­సీ­కి ఫి­ర్యా­దు చే­సిం­ది. దీం­తో ఐసీ­సీ ఈ చర్య­లు తీ­సు­కుం­ది. సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌­ను ఐసీ­సీ మ్యా­చ్ రి­ఫ­రీ రిచీ రి­చ­ర్డ్‌­స­న్ వి­చా­రిం­చా­రు. అయి­తే తనపై వచ్చిన ఆరో­ప­ణ­ల­ను సూ­ర్య ఖం­డిం­చా­డు. టో­ర్నీ­లో ఇకపై రా­జ­కీ­య­ప­ర­మైన వ్యా­ఖ్య­లు చే­యొ­ద్ద­ని ఐసీ­సీ అత­డి­కి సూ­చిం­చిం­ది. అలా­గే క్రి­కె­ట్‌ మై­దా­నం­లో అను­చి­తం­గా ప్ర­వ­ర్తిం­చి­నం­దు­కు పా­కి­స్థా­న్ ఫా­స్ట్ బౌ­ల­ర్ హా­రి­స్ రవూ­ఫ్‌­కు కూడా మ్యా­చ్‌ ఫీ­జు­లో 30 శాతం జరి­మా­నా­ను ఐసీ­సీ వి­ధిం­చిం­ది.

Tags

Next Story