BANGLA: బంగ్లా క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం

BANGLA: బంగ్లా క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం
X
టీ 20 వరల్డ్‌కప్ బహిష్కరించడంపై ఫైర్... ఆసిఫ్ నజ్రుల్‌పై నిప్పులు చెరిగిన సల్లావుద్దీన్... నజ్రుల్ ఓ అబద్దాల కోరంటూ మండిపాటు... ప్రపంచకప్ కలలు నాశనం చేశాని ఆవేదన

టీ20 ప్రపంచకప్‌ చుట్టూ నెలకొన్న వివాదం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా, అంతర్గతంగా కూడా ఆరోపణలు–ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌ బహిరంగంగా మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ప్రభుత్వ నిర్ణయమా? లేక ఆటగాళ్లు, బోర్డు తీసుకున్న నిర్ణయమా? అన్న అంశంపై వచ్చిన యూ-టర్న్‌ వ్యాఖ్యలే ఈ వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

మాట మార్పుపై ఆగ్రహం

ప్రా­రం­భం­లో బం­గ్లా­దే­శ్‌ జట్టు భా­ర­త్‌­లో పర్య­టిం­చ­క­పో­వ­డా­ని­కి తమ ప్ర­భు­త్వం తీ­సు­కు­న్న ని­ర్ణ­య­మే కా­ర­ణ­మ­ని ఆసి­ఫ్‌ నజ్రు­ల్‌ ప్ర­క­టిం­చా­రు. అయి­తే కొ­ద్ది రో­జు­ల­కే ఆయన తన మాట మా­ర్చి, భా­ర­త్‌­కు వె­ళ్ల­కూ­డ­ద­న్న ని­ర్ణ­యం ఆట­గా­ళ్లు మరి­యు బం­గ్లా­దే­శ్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు తీ­సు­కు­న్న­ద­ని చె­ప్పా­రు. ఈ వి­రు­ద్ధ ప్ర­క­ట­న­ల­పై అసి­స్టెం­ట్‌ కో­చ్‌ మహ­మ్మ­ద్‌ సలా­వు­ద్దీ­న్‌ తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. “నేను స్వ­యం­గా ఒక ఉపా­ధ్యా­యు­డి­ని. ఉపా­ధ్యా­యు­లు సా­ధా­ర­ణం­గా అబ­ద్ధా­లు చె­ప్ప­రు. నజ్రు­ల్‌ కూడా బో­ధ­నా రం­గా­ని­కే చెం­ది­న­వా­రు. ఢాకా వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో వి­ద్యా­ర్థు­ల­కు పా­ఠా­లు బో­ధిం­చే వ్య­క్తి. అలాం­టి వ్య­క్తి ఇలాం­టి వి­ధం­గా మాట మా­ర్చ­డం బా­ధా­క­రం” అని సలా­వు­ద్దీ­న్‌ వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఒక­సా­రి ఒక కా­ర­ణం చె­ప్పి, తర్వాత పూ­ర్తి­గా వి­రు­ద్ధం­గా మా­ట్లా­డ­టం అం­గీ­కా­ర­యో­గ్యం కా­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. మాట మా­ర్చి బం­గ్లా­దే­శ్ క్రి­కె­ట్ ను నజ్రు­ల్ సం­క్షో­భం ది­శ­గా తీ­సు­కె­ళ్లా­డ­ని.. ఇది ఎక్క­డి వరకు వె­ళ్తుం­దో చూ­డా­ల­ని నజ్రు­ల్ వె­ల్ల­డిం­చా­రు.

ఆటగాళ్లపై మానసిక ప్రభావం

ఈ వి­వా­దం కే­వ­లం పరి­పా­ల­నా స్థా­యి­లో­నే కా­కుం­డా ఆట­గా­ళ్ల­పై కూడా తీ­వ్ర ప్ర­భా­వం చూ­పిం­ద­ని సలా­వు­ద్దీ­న్‌ తె­లి­పా­రు. “ఒక యువ క్రి­కె­ట­ర్‌ ప్ర­పం­చ­క­ప్‌­లో ఆడా­ల­ని కలలు కం­టా­డు. ఆ కలను ఒక్క క్ష­ణం­లో ధ్వం­సం చే­శా­రు. జట్టు­లో­ని ఇద్ద­రు ఆట­గా­ళ్లు ఐదు రో­జుల పాటు తీ­వ్ర మా­న­సిక ఒత్తి­డి­ని ఎదు­ర్కొ­న్నా­రు” అని ఆయన ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. అం­త­ర్జా­తీయ వే­ది­క­పై ఆడే అవ­కా­శా­న్ని కో­ల్పో­వ­డం ఒక ఆట­గా­డి కె­రీ­ర్‌­లో పె­ద్ద దె­బ్బ అని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఈ పరి­ణా­మాల వె­నుక భా­ర­త్‌–బం­గ్లా­దే­శ్‌ల మధ్య నె­ల­కొ­న్న దౌ­త్య ఉద్రి­క్త­త­లూ ప్ర­ధాన పా­త్ర పో­షిం­చా­య­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. బం­గ్లా పే­స­ర్‌ ము­స్తా­ఫి­జు­ర్‌ రె­హ్మా­న్‌­ను ఐపీ­ఎ­ల్‌ నుం­చి వి­డు­దల చే­సిన తర్వాత రెం­డు దే­శాల మధ్య సం­బం­ధా­లు దె­బ్బ­తి­న్నా­యి. ఆ తర్వాత బం­గ్లా­దే­శ్‌ ప్ర­భు­త్వం తమ దే­శం­లో ఐపీ­ఎ­ల్‌ ప్ర­సా­రా­ల­ను ని­లి­పి­వే­యా­ల­ని ఆదే­శించింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో పరిపాలనా స్థాయిలో స్పష్టతలేమి ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం అంటూ చెప్పడం, తర్వాత ఆటగాళ్లు–బోర్డు నిర్ణయమని చెప్పడం ప్రజల్లో సందేహాలు రేకెత్తించింది. సలావుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అస్పష్టతను బహిర్గతం చేశాయి. అంతర్జాతీయ టోర్నీ వంటి కీలక వేదికలో జట్టు పాల్గొనకపోవడం వెనుక అసలు కారణాలు ఏమిటి? భద్రతా ఆందోళనలే నిజమైన కారణమా? లేక దౌత్య ఉద్రిక్తతల ప్రభావమా? అనే ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ వివాదం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లలో నిరుత్సాహం నెలకొనే ప్రమాదం ఉంది.

Tags

Next Story