BCCI: కాంట్రాక్టు లిస్ట్ నుంచి అయ్యర్-కిషన్ ఔట్..

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. 2023-24 సీజన్ కోసం విడుదల చేసిన ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లు లేవు. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్లో పాల్గొనలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేనిన బోర్డు కాంట్రాక్టు జాబితా నుంచి పేర్లు పీకేసింది. అయ్యర్, ఇషాన్ పేర్లు లేకుండా వార్షిక కాంట్రాక్టుల లిస్ట్ రిలీజ్ చేసింది. అటు ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ రింకూ సింగ్ గ్రేడ్-సీలో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఏ+ గ్రేడ్లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. బీసీసీఐ ఈ ఏడాది 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది.
సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా A+ జాబితాలో నిలవగా రాహుల్, గిల్, సిరాజ్ గ్రేడ్ Aకు పదోన్నతి పొందారు. రిషబ్ పంత్ B గ్రేడ్లో ఉన్నాడు. టీ20 స్టార్ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్వర్మ కొత్తగా గ్రేడ్ Cలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారిని కూడా గ్రేడ్ C లో చేరుస్తారు. ఈ కాంట్రాక్టులు అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులో ఉంటాయి. ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్దీప్, విజయ్కుమార్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాంత్ కావేరప్ప ఉన్నారు.
గ్రేడ్ A+లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. గ్రేడ్ Bలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. గ్రేడ్ సీలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com