ఆఫీషియల్ : ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్..
By - TV5 Digital Team |7 March 2021 8:45 AM GMT
క్రికెట్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ... ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నట్లుగా వెల్లడించింది.
క్రికెట్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ... ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చెన్నై వేదికగా బెంగళూరు, ముంబయి తొలి మ్యాచ్ లో పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదికగా.. ప్లే ఆఫ్ మ్యాచ్ తో పాటు MAY 30న ఫైనల్ జరగనుంది. చెన్నై, ముంబయి, కోల్ కత్తా, బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్ ను ఐపీఎల్ కు వేదికలుగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్ -దిల్లీలో 8, మిగిలిన నాలుగు వేదికల్లో 10 మ్యాచులు జరుగుతాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com