BCCI: ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలు

BCCI: ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలు
X
ఆటగాళ్లు, సిబ్బంది గదుల్లోని నో ఎంట్రీ... అనధికార వ్యక్తులను నిషేధించిన బీసీసీఐ.. భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరిక

ఐపీ­ఎ­ల్ ప్ర­స్తుత సీ­జ­న్‌ కీలక దశకు చే­రు­కుం­టు­న్న వేళ ఆట­గా­ళ్ల భద్రత, క్ర­మ­శి­క్షణ అం­శా­ల్లో బీ­సీ­సీఐ మరింత కఠిన వై­ఖ­రి అవ­లం­బి­స్తోం­ది. టో­ర్నీ ప్ర­తి­ష్ఠ­కు భంగం కలి­గిం­చే ఎలాం­టి ఘట­న­ల­నూ సహిం­చ­బో­మ­ని స్ప­ష్టం చే­స్తూ, ఆట­గా­ళ్లు, సహా­యక సి­బ్బం­ది, జట్టు అధి­కా­రు­ల­పై కట్టు­ది­ట్ట­మైన ని­బం­ధ­న­లు అమలు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ము­ఖ్యం­గా హో­ట­ల్‌ భద్రత, బయటి వ్య­క్తు­ల­తో సం­బం­ధా­లు, ఆట­గా­ళ్ల కద­లి­కల వి­ష­యం­లో కఠిన ఆదే­శా­లు జారీ చే­సిం­ది. ఇటీ­వల కొ­న్ని అవాం­ఛ­నీయ సం­ఘ­ట­న­లు, ప్రో­టో­కా­ల్‌ ఉల్లం­ఘ­న­లు బీ­సీ­సీఐ అవి­నీ­తి ని­రో­ధక వి­భా­గం దృ­ష్టి­కి రా­వ­డం­తో ఈ ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ మే­ర­కు బీ­సీ­సీఐ కా­ర్య­ద­ర్శి దే­వ­జి­త్ సై­కి­యా అన్ని ఫ్రాం­చై­జీల సీ­ఈ­ఓ­ల­కు ప్ర­త్యేక లే­ఖ­లు పం­పా­రు. మొ­త్తం ఏడు పే­జీల ని­బం­ధ­నల పత్రా­న్ని జత­చే­స్తూ ఆట­గా­ళ్ల ప్ర­వ­ర్తన, భద్రత వి­ష­యం­లో ఎలాం­టి రాజీ ఉం­డ­ద­ని స్ప­ష్టం చే­శా­రు. టో­ర్నీ గౌ­ర­వా­న్ని దె­బ్బ­తీ­సే చర్య­ల­పై కఠిన చర్య­లు తప్ప­వ­ని హె­చ్చ­రిం­చా­రు. ఈ సీ­జ­న్‌­లో ఆట­గా­ళ్లు, సహా­యక సి­బ్బం­ది, జట్టు అధి­కా­రుల ప్ర­మే­యం­తో కొ­న్ని క్ర­మ­శి­క్ష­ణా ఉల్లం­ఘ­న­లు చో­టు­చే­సు­కు­న్నా­య­ని, వా­టి­ని ని­ర్ల­క్ష్యం చే­స్తే ఐపీ­ఎ­ల్‌­తో పాటు ఫ్రాం­చై­జీ­లు, బీ­సీ­సీఐ ప్ర­తి­ష్ఠ­కు కూడా నష్టం కలి­గే ప్ర­మా­దం ఉం­ద­ని ఆయన పే­ర్కొ­న్నా­రు.

కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది తమ హోటల్‌ గదుల్లోకి అనధికార వ్యక్తులను అనుమతించకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇతర అతిథులు కలవాలంటే తప్పనిసరిగా మేనేజర్‌ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా గదుల్లోకి తీసుకెళితే అది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఆటగాళ్లు బయటివారిని కలవాల్సి వస్తే హోటల్‌ లాబీ లేదా లాంజ్‌లలో మాత్రమే సమావేశం కావాలని సూచించింది. ఇక ఆటగాళ్ల కదలికలపైనా బీసీసీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హోటల్‌ వెలుపలికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎల్‌ఓ) లేదా టీమ్‌ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌ (టీఐఓ)కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. వారి అనుమతి లేకుండా ఎవరూ హోటల్‌ నుంచి బయటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆటగాళ్ల కదలికలపై ప్రత్యేక నియంత్రణలు అమలు చేయనుంది. టోర్నీ కీలక దశలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా, భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండటమే ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది

ప్ర­స్తు­తం అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో హనీ­ట్రా­ప్‌­లు, బ్లా­క్‌­మె­యి­ల్‌ ప్ర­య­త్నా­లు పె­రు­గు­తు­న్న నే­ప­థ్యం­లో బీ­సీ­సీఐ అప్ర­మ­త్త­మై­న­ట్లు సమా­చా­రం. ఆట­గా­ళ్ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని జరు­గు­తు­న్న మో­స­పూ­రిత చర్య­లు, చట్ట­ప­ర­మైన సమ­స్య­లు, బె­ట్టిం­గ్‌ ము­ఠాల జో­క్యం వంటి అం­శా­ల­పై అవి­నీ­తి ని­రో­ధక వి­భా­గం తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే ఆట­గా­ళ్లు అన­వ­సర వి­వా­దా­ల్లో చి­క్కు­కో­కుం­డా ముం­ద­స్తు జా­గ్ర­త్త చర్య­లు తీ­సు­కుం­టు­న్న­ట్లు బో­ర్డు వర్గా­లు చె­బు­తు­న్నా­యి. అం­తే­కా­కుం­డా మ్యా­చ్‌ల సమ­యం­లో కూడా ఫ్రాం­చై­జీల ప్ర­వ­ర్త­న­పై బీ­సీ­సీఐ ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చిం­ది. మ్యా­చ్‌ జరు­గు­తు­న్న సమ­యం­లో ఫ్రాం­చై­జీ యజ­మా­ను­లు లేదా సీ­ని­య­ర్‌ మే­నే­జ్‌­మెం­ట్‌ సభ్యు­లు డగౌ­ట్‌­లో­కి వె­ళ్లి ఆట­గా­ళ్లు, కో­చిం­గ్‌ సి­బ్బం­ది­తో మా­ట్లా­డ­కూ­డ­ద­ని స్ప­ష్టం చే­సిం­ది.

Tags

Next Story