CRICKET: లంక వన్డే సిరీస్కు బుమ్రా దూరం

X
By - DESK |9 Jan 2023 4:42 PM IST
లంక వన్డే సిరీస్కు బుమ్రా దూరం శ్రీలంకతో రేపటి నుంచి జరిగే టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
శ్రీలంకతో రేపటి నుంచి జరిగే టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతన్ని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. గత సెప్టెంబర్ నుంచి ఆయన ఏ ఫార్మాట్లోనూ ఆడలేదు. మరోవైపు ఈ సిరీస్కు టీమిండియా రెండీ అయింది.
శ్రీలంక మూడు వన్డేల సిరీస్కు భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్,చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com