CRICKETERS: కేరళ కమ్యూనిటీ ఈవెంట్కు పాక్ మాజీ క్రికెటర్లు

X
By - Sathwik |1 Jun 2025 10:30 AM IST
ఈవెంట్కు పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ను ఆహ్వానం
దుబాయ్లో కేరళ కమ్యూనిటీ ఈవెంట్కు పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ను ఆహ్వానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి.. భారత్పై సాధించిన విజయమంటూ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రజలు చేసిన ర్యాలీలోనూ అఫ్రిది పాల్గొన్నాడు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేరళ కమ్యూనిటీ స్వాగతించడాన్ని సిగ్గు చేటు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. "ఇది ఎంత సిగ్గుచేటు.. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారతదేశంపై అతని విషపూరిత వైఖరి తర్వాత దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళీయులు ఈ భారత వ్యతిరేక పాకిస్థానీని 'బూమ్ బూమ్' అంటూ స్వాగతించారు" అని ఓ యూజర్ ఎక్స్లో ఈవెంట్ తాలూకు వీడియో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com