కష్టాల్లో టీమిండియా.. టాప్ఆర్డర్ ఔట్.. భారం వారిపైనే

England vs India 2nd Test: ఆతిథ్య ఇంగ్లాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తడబడుతోంది. నాలుగో రోజు తొలి సెషన్లో బ్యాటింగ్కు దిగిన టీమిండియా లాంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయింది. లాంచ్ సమయానికి 25 ఓవర్ల పాటు ఆట సాగగా టీమ్ఇండియా 56/3తో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్(5), రోహిత్ (21) రెండో ఇన్నింగ్స్ లో త్వరగానే పెవిలియన్ చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) సైతం విఫలమయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(3), అజింక్య రహానె(1) ఉన్నారు.
ప్రస్తుతం భారత్ 26పరుగలు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ రెండు, సామ్కరన్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు శనివారం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ జట్టు సారథి జో రూట్(180) భారీ శతకం సాధించాడు. బెయిర్ స్టో అర్థశతకంతో రాణించాడు. దాంతో ఇంగ్లాండ్ 26పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com