IND vs ENG 5th Test: ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్..

ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన ఐదోటెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 3-1తో టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్లో కూడా నెగ్గి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ బెయిర్స్టోలకు ఇది వందో టెస్టు కావడంతో అందరి దృష్టి వీరిపై నెలకొంది.
రాంచీ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్కు విరామం తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఈ మ్యాచ్లో అందుబాటులోకి వచ్చాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా తొలి బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. ఇప్పటివరకు ఈ సిరీస్లో అద్భుతంగా రాణించామని, సిరీస్లో ఆధిక్యాన్ని పెంచుకొని సిరీస్ను ముగించాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ సిరీస్లో మునుపటి మ్యాచ్లతో పోల్చితే ఈ పిచ్పై మంచి బౌన్స్ లభించే అవకాశం ఉందని, బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
బుమ్రా తిరిగి అందుబాటలోకి రావడంతో ఆకాష్ దీప్ నుంచి పక్కనపెట్టామని వివరించాడు. ఇక నిన్న సాయంత్రం రజత్ పటీదార్ గాయపడడంతో అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. ఇక 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నిజమైన దిగ్గజ క్రికెటర్ అని రోహిత్ శర్మ అన్నాడు. దేశానికి, కుటుంబానికి గర్వకారణమని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ఫైనల్ 11
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్మన్ గిల్, ఆకాష్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, రజత్ పాటిదార్,
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com