Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో భవానీ దేవి శుభారంభం..!
By - Gunnesh UV |26 July 2021 2:45 AM GMT
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము) విభాగంలో శుభారంభం చేసింది.
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము) విభాగంలో శుభారంభం చేసింది. సోమవారం తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో విజయం సాధించింది. కేవలం 6 నిమిషాల, 14 సెకండ్లలోనే విజయం సాధించి ఔరా అనిపించింది. దీనితో భవానీ తర్వాతి రౌండ్ లోకి దూసుకెళ్లింది. కాగా చెన్నైకి చెందిన భవానీ ఫెన్సింగ్ విభాగంలో విభాగంలో ఇండియా నుంచి ఒలింపిక్స్ కుక్ అర్హత సాధించిన తొలి క్రీడాకారణి కావడం విశేషం. తన తదుపరి మ్యాచును ప్రపంచ ర్యాకింగ్స్లో 4వస్థానంలో ఉన్న ఫ్రెంచ్ క్రీడాకారిణి బ్రూనెట్ను భవానీ దేవి ఎదుర్కొంటుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com