CT2025: మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

CT2025: మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
X
వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఓటమి తర్వాత స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డే ఫార్మాట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. 35 ఏళ్ల రహీం తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ‘నేను నా దేశం కోసం మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా, 100 శాతం అంకితభావం, నిజాయితీతో ఆడాను’ అని తెలిపాడు. 2006 ఆగస్టులో జింబాబ్వేపై వన్డేతో అరంగేట్రం చేసిన రహీమ్, 274 మ్యాచ్‌లతో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 19 ఏళ్లగా తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. రహీమ్ 2022లో టీ20లకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో ఇక కేవలం అతడు టెస్ట్ ఫార్మాట్‌లోనే కొనసాగనున్నాడు. ముష్ఫికర్ రహీమ్ ఆగస్టు, 2006లో జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేశారు. 274 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి.

రిటైర్మెంట్ ప్రకటించిన స్మిత్

వన్డేలకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, టీ20లలో కొనసాగుతానని తెలిపాడు. 2010లో వెస్టిండీస్‌తో వన్డేలో అరంగేట్రం చేసిన స్మిత్.. 170 వన్డేలు ఆడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన వేళ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తి సంతరించుకుంది. అలాగే 34.67 సగటుతో 28 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన స్మిత్ 2015లో వన్డే కెప్టెన్ అయ్యాడు.

స్మిత్‌ను ఓదార్చిన విరాట్ కోహ్లీ

ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు ఆసీస్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. విరాట్ కోహ్లీ మాత్రం స్మిత్ దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చాడు. ఓటమి బాధలో ఉన్న అతడికి కాసేపు ఊరటనిచ్చేలా మాటలు చెప్పాడు. ఈ సన్నివేశాలు అక్కడి చూపరుల మనసును తాకాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

CT-2025 సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఈ పోరులో శతకం బాదడంతో పాటు న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 19 వేల పరుగులు పూర్తి చేసుకున్న కివీస్ తొలి బ్యాటర్ గా ఘనత సాధించాడు.

Tags

Next Story