ICC: మహిళల వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. బీసీసీఐ, పీసీబీ అంగీకారంతో హైబ్రిడ్ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తమ టోర్నమెంట్ మ్యాచ్లను కొలంబోలో ఆడుతుంది. ఈ పోటీలోని మొదటి మ్యాచ్లో సెప్టెంబర్ 30న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత- శ్రీలంక జట్లు తలపడతాయి. ఇక, అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య హై-ఆక్టేన్ పోరు జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ లో అక్టోబర్ 1న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. అలాగే, అక్టోబర్ 8న కొలంబోలో పాకిస్తాన్తో.. అక్టోబర్ 22న ఇండోర్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియా తలపడనుంది.
అక్టోబర్ 5న హై వోల్టేజ్ మ్యాచ్
ఇండియా - పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ పోరు అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. భారత ప్రభుత్వం గతంలో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వెళ్లడానికి అనుమతించకపోవడంతో, రెండు బోర్డులు ముందుగా అంగీకరించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాకిస్థాన్ తమ అన్ని మ్యాచ్లను కొలంబోలో ఆడనుంది. ఈ మ్యాచు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పహల్గామ్దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
28 లీగ్ మ్యాచ్లు
ఈ మెగా టోర్నమెంట్ లో మొత్తం 28 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ దశ తర్వాత మూడు నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు బెంగళూరు, ఇండోర్, గౌహతి, విశాఖపట్నం, కొలంబోలో జరగనున్నాయి.ఇక, మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది.రెండో సెమీ-ఫైనల్ అక్టోబర్ 30న.. చివరి మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది.
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా – విశాఖపట్నం
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com