Ind vs Aus : రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియాపై రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగు వెనుకబడిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయగా.. భారత్ 262 పరుగులు చేసింది.
ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 4 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ కీలక వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో జడేజా 110 పరుగులు ఇచ్చి పది వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టు మ్యాచ్ మార్చి 1 నుంచి ఇందౌర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులోనూ గెలిస్తే టెస్టుల్లో టాప్ ర్యాంక్తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లడం ఖాయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com