India Vs Korea: ప్రారంభమైన ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్

జూన్ 27వ తేదీ నుంచి ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభమవునుంది. ఈ మెగా టోర్నీకి దక్షిణ కొరియాలోని బుసాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో భారత్, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్ దేశాలు పోటీ పడనున్నాయి. జూన్ 30న టోర్నీ ముగియనుంది. మొదటి మ్యాచ్ చైనీస్ తైపీ, ఇరాన్ జట్ల మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ను అదే రోజు కొరియాతో తలపడుంది.
భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో బరిలో దిగనుంది. చివరగా 2017 లో జరిగిన టోర్నీలో ఫైనల్లో పాకిస్థాన్ని 36-22 తేడాతో ఓడించి కప్ కైవసం చేసుకుంది. మళ్లీ 6 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. 1980 లో మొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. అత్యధికంగా 7 సార్లు భారత్ టైటిళ్లను గెలుచుకుంది. మరోసారి ఇరాన్ విజేతగా నిలిచింది.
భారత్ 12 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్లో ప్రాచుర్యం పొందిన ప్రో కబడ్డీ లీగ్ (PKL)లోని కీలక ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. మరోవైపు ఇంకో ఫేవరేట్ టీం ఇరాన్ తన స్టార్ డిఫెండర్ ఫజెల్ అత్రాకలి అకుండానే బరిలోకి దిగనుంది.
ఈ ఛాంపియన్షిప్ మ్యాచులు టోర్నీ అధికారిక యూట్యూబ్ ఛానల్ (@user-eo6dh5tb3u) లో ప్రత్యక్ష ప్రసారం అవనున్నాయి.
భారత జట్టు:
అర్జున్ దేశ్వాల్, నవీన్ కుమార్, సచిన్, అస్లాం ఇనాందార్, మోహిత్ గోయత్, సునీల్ కుమార్, పర్వేష్ బైంస్వాల్, నితిన్ రావల్, నితేష్ కుమార్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పవన్ షెరావత్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com