India vs New Zealand: ముంబై టెస్టులో భారత్ ఘనవిజయం

India vs New Zealand: ముంబై టెస్టులో భారత్ ఘనవిజయం
India vs New Zealand: 372 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది.

IND vs NZ : ముంబై వేదికగా కివీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 372 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, జయంత్ యాదవ్‌ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసిన టీమిండియా కివీస్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 167 పరుగులకే ఆలౌటైంది.

Tags

Read MoreRead Less
Next Story