IND vs SL : పంత్, కోహ్లీ సెంచరీ మిస్, భారత్దే తొలి రోజు..!

IND vs SL : మొహాలీ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 357పరుగులు చేసింది. రిషభ్ పంత్ (96) పరగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక హనుమ విహారి 58, కోహ్లీ 45, జడేజా 45 (నాటౌట్) పరుగులతో రాణించారు. ఎంబుల్దెనియా 2.. లక్మల్, ఫెర్నాండో, లహిరు కుమార, డిసిల్వా తలో వికెట్ తీశారు. అయితే వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ కచ్చితంగా సెంచరీ కొడతాడని అనుకున్నారంతా.. కానీ ఆ ఆశలు నిరాశగానే మిగిలిపోయింది. విహారితో కలిసి కోహ్లీ 90 పరుగులు జోడించిన కోహ్లీ ఎంబుల్దెనియా వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. దీనితో హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే వెనుదిరిగాడు కోహ్లీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com