RINKU: ఎంపీ ప్రియ సరోజ్తో రింకూ ఎంగేజ్మెంట్

టీమిండియా క్రికెటర్, హార్డ్ హిట్టర్ రింకూసింగ్ త్వరలో నే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రింకూసింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ను వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 8న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. లక్నోలోని ఓ లగ్జరీ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. రాజకీయ కుటుంబానికి చెందిన 25 ఏళ్ల ప్రియ సరోజ్ ఉత్తర్ప్రదేశ్లోని మచిలీషహర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. రింకు, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ పరస్పరం ఇష్టపడ్డారని..పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్లో గ్రాండ్గా జరగనుంది. 27 ఏళ్ల రింకూ టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com