Rohit Sharma : టీంఇండియాకి బిగ్ షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ ఔట్...!

Rohit Sharma : దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కి ముందు టీంఇండియాకి బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా రోహిత్ శర్మ ఆడడం పైన సందిగ్ధత నెలకొంది. ఆదివారం రిషభ్ పంత్, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్తో కలిసి ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న హిట్ మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు.
అయితే దీనిపైన బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల(డిసెంబర్) 26 నుంచి సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్ట్లు, 3 వన్డేలు ఆడనుంది. సౌతాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా కఠిన బయో బబుల్ ఆంక్షల మధ్య ఈ సిరీస్లు ఆడనుంది.
సౌతాఫ్రికా గడ్డపైన టీంఇండియా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలిచింది లేదు.. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోన్న భారత జట్టుకి.. రోహిత్ కి గాయం పెద్ద దెబ్బే అని చెప్పాలి. రోహిత్ స్థానంలో భారత్ A జట్టుకు కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న ప్రియంక్ పంచల్ ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ప్రియంక్ పంచల్ భారత్ A తరుపున ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్ లలో కలిపి 120పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని పేరున 24 సెంచరీలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com