IPL 2022 Mega Auction: IPL వేలం.. భారీ స్థాయిలో వ్యాపారం.. ఎవరెవరు ఎంతకి..

IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 వేలంగా మోత మోగిస్తోంది. బెంగళూర్ వేదికగా జరుగుతున్న మెగా వేలంలో.. ప్లేయర్స్కు కాసుల పంట పండుతోంది. 600మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. ఈసారి కొత్తగా మరో రెండు జట్లు ఐపీఎల్లోకి వస్తున్నాయి. అత్యధికంగా శ్రేయస్ అయ్యర్ను కోల్కతా టీమ్.. 12కోట్ల 25లక్షలకు దక్కించుకుంది.
రబాడను 9కోట్ల 25లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. 8కోట్ల 25 లక్షలకు శిఖర్ ధావన్ను కూడా పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా.. ట్రెంట్ బౌల్ట్ను రాజస్థాన్ 8కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ను 7కోట్ల 25లక్షలకు కోల్కతా దక్కించుకోగా.. 6కోట్ల 75 లక్షలకు డికాక్ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
టీమిండియా పేసర్ మహ్మద్ షమీని 6కోట్ల 25లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను 6కోట్ల 25లక్షలకు ఢిల్లీ క్యాపిట్స్ సొంతం చేసుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ను రాజస్థాన్ 5కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com