IPL: తిలక్ తుఫానులో గుజరాత్ గల్లంతు

IPL: తిలక్ తుఫానులో గుజరాత్ గల్లంతు
X
తెలుగు కుర్రాడి సుడిగాలి సెంచరీ.. ఐపీఎల్లో అద్భుతం చేసిన తిలక్ వర్మ.. 45 బంతుల్లో సూపర్ సెంచరీ... గుజరాత్ పై ముంబై విజయం

ఐపీఎల్‌లో ఎప్పుడూ అనూహ్య మలుపులు సాధారణమే. కానీ ఒక మ్యాచ్‌లో జట్టు దాదాపు ఓటమి అంచుల నుంచి తిరిగి వచ్చి, ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించడం మాత్రం అరుదైన విషయం. అలాంటి అరుదైన పోరాటానికి వేదికైంది అహ్మదాబాద్‌. ఒక దశలో చేతులు ఎత్తేసినట్లు కనిపించిన ముంబయి ఇండియన్స్‌, ఒక్క ఆటగాడి అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను మాత్రమే కాదు—తమ సీజన్‌ను కూడా మళ్లీ గాడిలో పెట్టుకున్నట్టైంది. ఆ ఆటగాడు ఎవరో కాదు… తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.

వర్తు వర్మ వర్తు

ముం­బ­యి ఇం­డి­య­న్స్‌­కు ఈ సీ­జ­న్ ఆరం­భం ఆశా­జ­న­కం­గా ఉన్న­ప్ప­టి­కీ, ఆ తర్వాత వరు­స­గా నా­లు­గు ఓట­ము­లు జట్టు­ను తీ­వ్ర ఒత్తి­డి­లో­కి నె­ట్టా­యి. పా­యిం­ట్ల పట్టి­క­లో అట్ట­డు­గు స్థా­నం­లో ఉం­డ­టం­తో ఈ మ్యా­చ్ వా­రి­కి ‘డూ ఆర్ డై’లా మా­రిం­ది. గు­జ­రా­త్ టై­టా­న్స్ వంటి బల­మైన జట్టు­తో పో­రా­టం అంటే మరో పరీ­క్షే. అయి­తే మ్యా­చ్ ప్రా­రంభ దశలో చూ­సిన వా­ళ్లం­ద­రి­కీ ముం­బ­యి మరో­సా­రి ఓడి­పో­తుం­ద­ని అని­పిం­చిం­ది. టాస్ గె­లి­చి బ్యా­టిం­గ్‌­కు ది­గిన ముం­బ­యి ఇం­డి­య­న్స్ ఆరం­భం ఆశిం­చి­నంత బా­గా­లే­దు. ఓపె­న­ర్లు త్వ­ర­గా ఔట­వ­డం­తో స్కో­రు ముం­దు­కు కద­ల్లే­దు. మధ్య­లో వచ్చిన బ్యా­ట­ర్లు కూడా ఎక్కు­వ­సే­పు ని­ల­బ­డ­లే­క­పో­యా­రు. ము­ఖ్యం­గా రబాడ బౌ­లిం­గ్ ముం­బ­యి టాప్ ఆర్డ­ర్‌­ను కు­ది­పే­సిం­ది. పవ­ర్‌­ప్లే ము­గి­సే సరి­కి జట్టు 46 పరు­గు­ల­కు మూడు కీలక వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. తర్వాత కూడా పరు­గుల రేటు పె­ర­గ­లే­దు. 14 ఓవ­ర్లు పూ­ర్త­య్యే సరి­కి స్కో­రు కే­వ­లం 103/4 మా­త్ర­మే. అప్ప­టి­కే మ్యా­చ్ గు­జ­రా­త్ చే­తు­ల్లో­కి వె­ళ్లి­పో­యి­న­ట్లే కని­పిం­చిం­ది. ఈ సమ­యం­లో క్రీ­జు­లో ఉన్న తి­ల­క్ వర్మ కూడా చాలా నె­మ్మ­ది­గా ఆడు­తు­న్నా­డు. మొ­ద­టి 22 బం­తు­ల్లో అతను చే­సి­న­వి కే­వ­లం 19 పరు­గు­లే. ఒక్క బౌం­డ­రీ కూడా లేదు. అలా కొ­న­సా­గి­తే ముం­బ­యి 160 పరు­గు­లు కూడా చే­య­లే­న­ట్టే అని­పిం­చిం­ది. కానీ క్రి­కె­ట్‌­లో ఒక్క క్ష­ణం చాలు—గేమ్ మా­రి­పో­వ­డా­ని­కి. 15వ ఓవర్ నుం­చి తి­ల­క్ ఆట పూ­ర్తి­గా మా­రి­పో­యిం­ది. ఒక్క­సా­రి­గా గేర్ మా­ర్చిన అతను గు­జ­రా­త్ బౌ­ల­ర్ల­పై వి­రు­చు­కు­ప­డ్డా­డు. ముం­దు­గా ప్ర­సి­ద్ధ్ కృ­ష్ణ ఓవ­ర్‌­లో బౌం­డ­రీ­లు బాది వేగం పెం­చా­డు. తర్వాత రషీ­ద్ ఖాన్ వంటి స్టా­ర్ బౌ­ల­ర్‌­ను కూడా వి­డి­చి­పె­ట్ట­లే­దు. అశో­క్ శర్మ వే­సిన ఓవ­ర్‌­లో అయి­తే అతను ని­జం­గా వి­ధ్వం­సం సృ­ష్టిం­చా­డుఆ ఓవ­ర్‌­లో వరు­స­గా భారీ షా­ట్లు కొ­ట్టి మ్యా­చ్‌­ను తా­రు­మా­రు చే­శా­డు. తి­ల­క్ వర్మ చి­వ­రి 23 బం­తు­ల్లో చే­సిన 82 పరు­గు­లు మ్యా­చ్‌­కు టర్నిం­గ్ పా­యిం­ట్‌­గా ని­లి­చా­యి. చి­వ­రి ఓవ­ర్లో కూడా అదే దూ­కు­డు కొ­న­సా­గిం­చి తన శత­కా­న్ని పూ­ర్తి చే­శా­డు. మొ­త్తం 45 బం­తు­ల్లో 101 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చిన తి­ల­క్, తన కె­రీ­ర్‌­లో తొలి ఐపీ­ఎ­ల్ సెం­చ­రీ నమో­దు చే­శా­డు. అతని ఇన్నిం­గ్స్‌­లో 8 ఫో­ర్లు, 7 సి­క్స­ర్లు ఉం­డ­టం వి­శే­షం.

చేసిన స్కోరు సరిపోతుందా అన్న సందేహం ఉన్నప్పటికీ, ముంబయి బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలను తారుమారు చేశారు. బుమ్రా తొలి బంతికే వికెట్ తీసి గుజరాత్‌పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత అశ్వని కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా ముంబయి వైపు తిప్పాడు. గుజరాత్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. స్టార్ ఆటగాళ్లు గిల్, బట్లర్ త్వరగా ఔటవడం తో జట్టు కుదేలైంది.

Tags

Next Story