IPL: తొలి బంతికే అవుట్ చేస్తానని అప్పుడే చెప్పా: ప్రఫుల్

ఇండియన్ ప్రిమియర్ లీగ్ వంటి భారీ వేదికపై ప్రతీ సీజన్ కొత్త ప్రతిభను పరిచయం చేస్తుంది. ఈసారి కూడా అలాంటి ఓ నయా సంచలనం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈసారి హైలైట్ అయినది బ్యాట్తో పరుగులు రాబట్టిన ఆటగాడు కాదు.. బంతితో మాయ చేసిన ఓ యువ పేసర్. అరంగేట్ర మ్యాచ్లోనే అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రఫుల్ హింగే ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాడు. తొలి ఓవర్లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అద్భుత ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని మొదటి బంతికే ఔట్ చేయడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. మొత్తం మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ప్రఫుల్, తన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
ఈ ప్రదర్శన యాదృచ్ఛికం కాదని, ముందుగానే తన మనసులో వేసుకున్న లక్ష్యమేనని ప్రఫుల్ వెల్లడించాడు. తన అరంగేట్రం ఎలా ఉండాలో గత ఏడాదే నిర్ణయించుకున్నానని, మొదటి మ్యాచ్లోనే నాలుగు లేదా ఐదు వికెట్లు తీయాలని అనుకున్నానని చెప్పాడు. పవర్ ప్లేలోనే బ్యాటర్లపై ఆధిపత్యం సాధించాలనే సంకల్పంతో బౌలింగ్ చేశానని తెలిపాడు. ముఖ్యంగా వైభవ్ను తొలి బంతికే ఔట్ చేస్తానని ముందే తన సన్నిహితులకు చెప్పినట్లు వెల్లడించడం అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడిన ప్రఫుల్, తాను 13 ఏళ్ల వయసులోనే ఈ ఆటను ప్రారంభించానని చెప్పాడు. మొదట్లో లెదర్ బాల్ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, క్లబ్లో చేరాలని పట్టుదలతో ముందుకెళ్లాడని వివరించాడు.
క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడిన ప్రఫుల్, తాను 13 ఏళ్ల వయసులోనే ఈ ఆటను ప్రారంభించానని చెప్పాడు. మొదట్లో లెదర్ బాల్ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, క్లబ్లో చేరాలని పట్టుదలతో ముందుకెళ్లాడని వివరించాడు. తన తండ్రి మొదట అనుమతించకపోయినా, తరువాత ఒప్పుకున్నారని చెప్పాడు. అప్పటి నుంచి నిరంతర కృషితో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తున్నానని, తమ కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివని భావోద్వేగంగా తెలిపాడు. తన విజయంలో కోచ్లు, సహాయక సిబ్బంది పాత్ర కీలకమని ప్రఫుల్ గుర్తు చేశాడు. బౌలింగ్ కోచ్ వరుణ్ ఇచ్చిన మార్గదర్శకం ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. అలాగే ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ అందించిన శిక్షణ తనకు ఎంతో దోహదపడిందని తెలిపాడు. గాయాల నుంచి కోలుకునే సమయంలో ఫిజియో నవీన్ అందించిన సహాయం కూడా ముఖ్యమని వెల్లడించాడు. విదర్భకు చెందిన 24 ఏళ్ల ఈ పేసర్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పటివరకు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 27 వికెట్లు సాధించిన ప్రఫుల్ను ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఇప్పుడు అరంగేట్రంలోనే మెరిసి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఈ యువ బౌలర్, రాబోయే మ్యాచ్ల్లో ఇంకెంత ప్రభావం చూపిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
