IPL: రాజస్థాన్‌లోకి జడేజా..చెన్నైలోకి సంజూ శాంసన్

IPL: రాజస్థాన్‌లోకి జడేజా..చెన్నైలోకి సంజూ శాంసన్
X
ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్ పూర్తి.. అధికారికంగా ధ్రువీకరించిన ఐపీఎల్.. రాజస్థాన్‌లోకి జడేడా, సామ్ కరణ్

ఐపీ­ఎ­ల్‌ 2026కు ముం­దు ఆయా ఫ్రాం­ఛై­జీల మధ్య జరి­గిన ట్రే­డ్‌ అభి­మా­ను­ల్లో ఆస­క్తి రే­పు­తోం­ది. తా­జా­గా ఎని­మి­ది మంది ఆట­గా­ళ్ల ట్రే­డ్‌ పూ­ర్త­యి­న­ట్టు ఐపీ­ఎ­ల్‌ ధ్రు­వీ­క­రిం­చిం­ది. ముం­దు­నుం­చి వా­ర్త­లు వస్తు­న్న­ట్లు­గా­నే రవీం­ద్ర­జ­డే­జా, సా­మ్‌­క­ర­ణ్‌ రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ గూ­టి­కి, సం­జు­శాం­స­న్‌ చె­న్నై సూ­ప­ర్‌ కిం­గ్స్‌ జట్టు­లో­కి వచ్చా­రు. మహ్మ­ద్‌ షమీ.. సన్‌­రై­జ­ర్స్‌ హై­ద­రా­బా­ద్‌ నుం­చి లఖ్‌­న­వూ సూ­ప­ర్‌ జె­యిం­ట్స్‌­కు మా­రా­డు. సచి­న్‌ తెం­దూ­ల్క­ర్‌ కు­మా­రు­డు అర్జు­న్‌ తెం­దూ­ల్క­ర్‌ ముం­బ­యి ఇం­డి­య­న్స్‌ నుం­చి లఖ్‌­న­వూ జట్టు­లో­కి వచ్చా­డు. మయాం­క్‌ మా­ర్కం­డే కో­ల్‌­క­తా నై­ట్‌ రై­డ­ర్స్‌ జట్టు నుం­చి ముం­బ­యి టీ­మ్‌­లో­కి వచ్చా­డు. ని­తీ­శ్‌ రాణా రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ నుం­చి ఢిల్లీ క్యా­పి­ట­ల్స్‌­కు, డో­నో­వ­న్ ఫె­రీ­రా ది­ల్లీ క్యా­పి­ట­ల్స్‌ నుం­చి రా­జ­స్థా­న్‌ రా­య­ల్స్‌ జట్టు­లో­కి వచ్చా­రు.

సంజూ కోసం విశ్వ ప్రయత్నం

అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడబోతున్నాడు. అతన్ని సీఎస్‌కే టీమ్‌కి ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, బదులుగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని టీమ్‌లోకి తెచ్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 12 సీజన్లు ఆడిన రవీంద్ర జడేజాకి ఐపీఎల్ 2025 సీజన్‌లో రూ.18 కోట్లతో రిటెన్షన్ దక్కింది. అయితే దాన్ని రూ.14 కోట్లకు తగ్గించి, ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 సీజన్‌లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. అలాగే ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లబోతున్నాడు. అతన్ని రూ.2.4 కోట్ల ప్రస్తుత ధరకే ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ కె­ప్టె­న్, వి­కె­ట్ కీ­ప­ర్ ఎమ్మె­స్ ధోనీ, ఐపీ­ఎ­ల్ రి­టై­ర్మెం­ట్ ఖాయం కా­వ­డం­తో తన ప్లే­స్‌­ని రి­ప్లే­స్ చే­య­గల సత్తా ఉన్న వి­కె­ట్ కీ­పిం­గ్ బ్యా­ట­ర్ కోసం చూ­సిన చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్, సంజూ శాం­స­న్ కోసం వి­శ్వ ప్ర­య­త్నా­లు చే­సిం­ది. తొ­లుత రవి­చం­ద్ర­న్ అశ్వి­న్, శి­వ­మ్ దూబే వంటి ప్లే­య­ర్ల­ను రా­జ­స్థా­న్ రా­య­ల్స్‌­కి ఇచ్చేం­దు­కు చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఆఫర్ ఇచ్చిం­ది. అయి­తే దా­ని­కి రా­జ­స్థా­న్ రా­య­ల్స్ ఒప్పు­కో­లే­దు. అశ్వి­న్, ఐపీ­ఎ­ల్ రి­టై­ర్మెం­ట్ కూడా ఇవ్వ­డం­తో ఇప్పు­డు ఆ ఛా­న్స్ కూడా లేదు.. ఎట్ట­కే­ల­కు రవీం­ద్ర జడే­జా, సామ్ కర్ర­న్‌­ల­తో ఢీల్ ఫై­న­ల్ చే­సు­కుం­ది.

ఎడమొహం-పెడమొహం

రా­జ­స్థా­న్ రా­య­ల్స్‌­ను ప్ర­తి ఏడా­ది అగ్ర స్థా­నం­లో ని­ల­ప­డం­లో సంజు శాం­స­న్ కృషి చె­ప్ప­లే­ని­ది. అయి­తే, ఐపీ­ఎ­ల్ 2025 తర్వాత రా­జ­స్థా­న్ మే­నే­జ్‌­మెం­ట్‌­‌­తో ఎడ­మొ­హం పె­డ­మొ­హం­గా ఉం­టు­న్నా­డు. దీ­ని­కి ప్ర­ధాన కా­ర­ణం­గా ఐపీ­ఎ­ల్ 2025 మెగా వే­లం­లో జోస్ బట్ల­ర్‌­ను రా­జ­స్థా­న్ వది­లే­య­డ­మే. ఈ వి­ష­యా­న్ని సంజు శాం­స­న్ కూడా చాలా సం­ద­ర్భా­ల్లో చె­ప్పా­డు. గత సీ­జ­న్‌­లో రూ. 18 కో­ట్ల­కు సం­జు­ని రి­టై­న్ చే­సు­కు­న్న రా­జ­స్థా­న్ ఫ్రాం­ఛై­జీ అత­ని­తో ఎక్కువ మ్యా­చ్‌­లు కూడా ఆడిం­చ­లే­దు. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్‌­కి రవీం­ద్ర జడే­జా ప్ర­ధాన వె­న్నె­ము­క­గా ఉన్నా­డు. 2012లో సీ­ఎ­స్కే­లో చే­రిన జడ్డూ టై­టి­ల్స్ అం­దిం­చ­డం­లో కీ­ల­కం­గా మా­రా­డు. పదే­ళ్ల­కు పైగా సీ­ఎ­స్కే­తో అను­బం­ధం ఉన్న జడ్డూ మూడు టై­టి­ల్స్‌­లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. ఐపీ­ఎ­ల్ 2025 మెగా వే­లా­ని­కి ముం­దు జడే­జా­ని సీ­ఎ­స్కే రూ.18 కో­ట్ల­కు రి­టై­న్ చే­సు­కుం­ది.

Tags

Next Story