KL RAHUL: వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

KL RAHUL: వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పితో బాధపడుతుండగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు కేఎల్‌ రాహుల్‌కు అప్పగించారు. ఈనెల 30 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే సిరీస్‌ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించారు. ఇటీవల ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లిన వన్డే జట్టు నుంచి నాలుగు మార్పులు చేశారు. కీపర్‌ రిషభ్‌ పంత్‌ జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా గాయంతో దూరం కావడంతో రాహుల్‌కు డిప్యూటీగా పంత్‌ వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో హైదరాబాదీ తిలక్‌ వర్మకు చోటు దక్కింది. రెండేళ్ల క్రితం తను భారత్‌ తరఫున చివరి వన్డే ఆడాడు.

గిల్ దూరం

మెడ నొ­ప్పి­తో బా­ధ­ప­డు­తు­న్న భారత కె­ప్టె­న్‌ శు­భ్‌­మ­న్‌ గి­ల్‌­కు మరింత వి­శ్రాం­తి అవ­స­ర­ము­న్న­ట్టు తె­లు­స్తోం­ది. దీం­తో దక్షి­ణా­ఫ్రి­కా­తో ఈనెల 30 నుం­చి ఆరం­భ­మ­య్యే మూడు వన్డేల సి­రీ్‌­స­కు అతను దూరం కా­ను­న్నా­డు. అయి­తే సఫా­రీ­ల­తో­నే జరి­గే టీ20 సి­రీ్‌­స­క­ల్లా గి­ల్‌ బరి­లో­కి దిగే అవ­కా­శం ఉం­ద­ని బో­ర్డు వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో జట్టు కె­ప్టె­న్సీ రే­సు­లో కే­ఎ­ల్‌ రా­హు­ల్‌­తో పాటు కీ­ప­ర్‌ పం­త్‌ పే­ర్లు వి­ని­పి­స్తు­న్నా­యి. ప్ర­స్తు­తం రెం­డో టె­స్టు సా­ర­థి­గా వ్య­వ­హ­రి­స్తు­న్న పం­త్‌ ఏడా­ది కా­లం­గా ఒక్క వన్డే మా­త్ర­మే ఆడా­డు. ఈ ఫా­ర్మా­ట్‌­లో ప్ర­ధాన కీ­ప­ర్‌­గా రా­హు­ల్‌­నే పరి­గ­ణి­స్తుం­డ­డం గమ­నా­ర్హం. ఓపె­న­ర్లు­గా జై­స్వా­ల్‌, వె­ట­ర­న్‌ రో­హి­త్‌­తో పాటు టా­పా­ర్డ­ర్‌­లో కో­హ్లీ ఆడ­ను­న్నా­డు. హర్షి­త్‌, సి­రా­జ్‌, అర్ష్‌­దీ­ప్‌ పే­స­ర్లు­గా ఉండే చా­న్సుం­ది. బు­మ్రా­కు ఈ సి­రీ­స్‌ నుం­చి వి­శ్రాం­తి­ని­వ్వ­చ్చు. స్పి­న్న­ర్‌ కు­ల్దీ­ప్‌ వ్య­క్తి­గత కా­ర­ణా­ల­తో గై­ర్హా­జ­రు కా­నుం­డ­గా అక్ష­ర్‌, సుం­ద­ర్‌, వరు­ణ్‌ జట్టు­లో ఉం­టా­రు.

అయ్యర్ ఆటకు దూరం

ఆస్ట్రే­లి­యా­తో వన్డే సి­రీ­స్‌­లో గా­య­ప­డ్డ టీ­మిం­డి­యా బ్యా­ట­ర్ శ్రే­య­స్ అయ్య­ర్‌ ఇప్ప­ట్లో తి­రి­గి మై­దా­నం­లో కని­పిం­చే అవ­కా­శా­లు కని­పిం­చ­డం లేదు. గత నె­ల­లో ఆస్ట్రే­లి­యా­తో జరి­గిన వన్డే మ్యా­చ్‌­లో ఫీ­ల్డిం­గ్ చే­స్తూ.. అయ్య­ర్ తీ­వ్రం­గా గా­య­ప­డ్డా­డు. క్యా­చ్‌ అం­దు­కొ­నే క్ర­మం­లో బలం­గా నే­ల­ను తా­కా­డు. దీం­తో అతడి ప్లీ­హా­ని­కి తీ­వ్ర గా­య­మైం­ది. అం­త­ర్గత రక్త­స్రా­వం అయిం­ది. ఆ తర్వాత అత­డి­ని ఐసీ­యూ­లో చే­ర్పిం­చి, చి­కి­త్స అం­దిం­చా­రు. ప్ర­స్తు­తం రీ­హా­బ్‌­లో ఉన్న అయ్య­ర్.. కో­లు­కు­నేం­దు­కు మరి­కొ­న్ని రో­జు­లు పట్టే అవ­కా­శం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ నెల 16న ఆస్ట్రే­లి­యా­తో రెం­డో వన్డే సం­ద­ర్భం­గా క్యా­చ్‌ పట్టే ప్ర­య­త్నం­లో డై­వ్‌ చే­య­గా.. అతడి కడు­పు­లో తీ­వ్ర గా­య­మైన సం­గ­తి తె­లి­సిం­దే. సి­డ్నీ­లో­ని ఓ ఆసు­ప­త్రి­లో రెం­డు రో­జు­లు ఐసీ­యూ­లో ఉండి చి­కి­త్స చే­యిం­చు­కు­న్న అతను.. అక్క­డి నుం­చి డి­శ్చా­ర్జి అయి స్వ­దే­శా­నా­కి వచ్చా­డు. లోపల గాయం పూ­ర్తి­గా మాని, శ్రే­య­స్‌ మ్యా­చ్‌ ఫి­ట్‌­నె­స్‌ సా­ధిం­చ­డా­ని­కి రెం­డు నె­ల­ల­కు పై­గా­నే సమయం పడు­తుం­దట. జన­వ­రి 11 నుం­చి న్యూ­జి­లాం­డ్‌­తో జరి­గే వన్డే సి­రీ­స్‌­కు కూడా అతను అం­దు­బా­టు­లో­కి రాడట. ఫి­ట్‌­నె­స్‌ సా­ధిం­చి­నా మ్యా­చ్‌ ప్రా­క్టీ­స్‌ ఉం­డ­దు కా­బ­ట్టి ఫి­బ్ర­వ­రి-మా­ర్చి నె­ల­ల్లో జరి­గే టీ20 ప్ర­పం­చ­క­ప్‌ ఎం­పి­క­కు శ్రే­య­స్‌ పే­రు­ను సె­ల­క్ట­ర్లు పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­వ­డం కష్ట­మే.

Next Story