IPL: లక్నో జైత్రయాత్రకు ఢిల్లీ బ్రేక్

ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ఢిల్లీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ తర్వాత బ్యాట్తోనూ సత్తాచాటి సాధికార విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. కుల్దీప్ యాదవ్ తన స్పిన్తో లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. లక్నో సారధి కె.ఎల్.రాహుల్ 39 పరుగులు, ఆయుష్ బదోని 55, ఆర్షద్ ఖాన్ 20 పరుగులతో రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి..167 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో నలుగురు సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు.
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 3, ఖలీల్ అహ్మద్...... రెండు వికెట్లు తీశారు. 168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన దిల్లీ.. సునాయస విజయం సాధించింది. పృథ్వీ షా 32, మెక్గర్క్ 55, కెప్టెన్ రిషబ్ పంత్ 41 పరుగులతో రాణించారు. వీరు ముగ్గురు రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా నవీనుల్ హక్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. 13 బంతుల్లో నాలుగు ఫోర్లతో 19 పరుగులు చేసి డికాక్ అవుటయ్యాడు. దేవదత్ పడిక్కల్ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. డికాక్, పడిక్కల్ అవుటైనా క్రీజులో ఉన్నంతసేపు లక్నో సారధి రాహుల్ ధాటిగానే ఆడాడు. 22 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసిన రాహుల్ను... కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టోయినీస్ ఎనిమిది, నికోలస్ పూరన్ సున్నా... దీపక్ హుడా పది పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు. ఒకే ఓవర్లో స్టోయినిస్, పూరన్ను అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ లక్నోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నపూరన్ను అద్భుత బంతితో బౌల్డ్ చేసిన బంతిని చూసి తీరాల్సిందే. వరుసగా వికెట్లు పడుతున్నా లక్నో బ్యాటర్ ఆయుష్ బదోని లక్నోను ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన బదోని అర్ధ శతకంతో లక్నోకు పోరాడే స్కోరును అందించాడు. 35 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్తో బదోని 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో అర్షద్ఖాన్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. బదోని పోరాటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్కు... పృథ్వీ షా-వార్నర్ 23 పరుగుల జోడించారు. ఎనిమిది పరుగులు చేసిన వార్నర్ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. కానీ పృథ్వీ షా, జేక్ ఫ్రెసర్ మెక్గర్క్ ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. రవి బిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్లో 32 పరుగులు చేసిన పృథ్వీ ఔటయ్యాడు. పృథ్వీ అవుటైనా మెక్గర్క్ ధాటిగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో మెక్గర్క్ 55 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో అవుటయ్యాడు. రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com