Manika Batra: మనికా బాత్రాకు చేదు అనుభవం

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా (Manika Batra)కు చేదు అనుభవం ఎదురైంది. పెరూలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (WTT) టోర్నీలో పాల్గొని తిరిగి స్వదేశానికి బయలుదేరిన మనిక తన లగేజ్(essential sports kit') పోగుట్టుకుంది. పెరూ నుంచి ఢిల్లీ కి వస్తుండగా విమానంలో క్రీడా సామగ్రి(sports kit)తో కూడిన లగేజీ బ్యాగ్ పోగొట్టుకోవడం(lost her baggage )పై తన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విటర్లో మనికా బాత్రా పోస్ట్ చేశారు. విలువైనవి అని పేర్కొన్న ట్యాగ్ ఉన్నా విమానాశ్రయంలో తన లగేజ్ పోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లగేజ్ విషయంలో విమానయాన సంస్థ నుంచి తనకు సరైన రీతిలో స్పందన రాలేదని మనికా(Table Tennis star Manika Batra) పేర్కొంది. లిమాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్(WTT Contender tournament in Lima) ఆడిన తర్వాత నెదర్లాండ్స్కు చెందిన కెఎల్ యం (KLM) విమానంలో లిమా నుంచి ఆమ్స్టర్డామ్కు చేరుకుంది. అక్కడ నుంచి ఢిల్లీకి వస్తుండగా మనికా లగేజీ మిస్ అయ్యింది.
రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీల కోసం కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్ కోల్పోవడంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య(Jyotiraditya Scindia)కు మనిక ఫిర్యాదు చేసింది. రాబోయే టోర్నమెంట్ కోసం సిద్ధం చేసుకున్న క్రీడా సామగ్రి ఉన్న బ్యాగ్ పోవడాన్ని తాను నమ్మలేక పోతున్నానని... దయచేసి తన సమస్యను పరిష్కరించి సహాయం చేయాలని సింధియాకు ఫిర్యాదు చేశారు. మనికా ఫిర్యాదుపై కేంద్రమంత్రి జోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో మనికా బాత్రా, జి. సత్యన్లు ప్రపంచ ర్యాంకింగ్లో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ జోడి సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్కు నాయకత్వం వహించనున్నారు. ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఆసియా కప్లో కాంస్యం పతకం సొంతం చేసుకొన్న తొలి భారత మహిళా ప్లేయర్గా బాత్రా నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఐదో ర్యాంకర్, మూడుసార్లు ఆసియా కప్ ఛాంపియన్, జపాన్ ప్లేయర్ హిన హయతను ఓడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com