MESSI: హైదరాబాద్ను ఊపేస్తున్న మెస్సీ మేనియా

ప్రపంచం మొత్తం మనవైపే చూడాలి అనుకున్నప్పుడు… అప్లై చేయాల్సిన ఫార్ములాలు ఈ రెండే. సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్య తరచుగా ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ పోటీపడుతున్నది పక్క రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో అని. గ్లోబల్ కాంపిటిషన్లో తెలంగాణను పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా. సో, గ్లోబల్ లెవెల్లో తెలంగాణకు గుర్తింపు రావాలంటే.. ఆట కూడా ఇంటర్నేషనల్ పర్సన్స్తోనే ఉండాలనే సంకేతాలు పంపుతున్నారు. పైగా ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం కోసం గ్లోబల్ సమిట్ పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో స్పోర్ట్స్కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని అడ్వర్టైజ్ చేయడం కూడా ఒక గోల్.. హైదరాబాద్కు బిల్గేట్స్ వచ్చాక.. సిటీ ఫేమ్ మరో రేంజ్ని టచ్ చేసింది. అంతటి బిల్ క్లింటనే హైదరాబాద్ లో అడుగు పెట్టిన తరువాత ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అండ్ మీడియాలో హైదరాబాద్కు గొప్ప బ్రాండింగ్ జరిగింది. టెక్నాలజీ అని, ఏఐ అని, సోషల్ మీడియా అని.. ఆ రూట్లో ఎంత ప్రయత్నించినా రాని బ్రాండింగ్.. కొన్నిసార్లు ఒక్క పర్సన్తో వచ్చేస్తుంది. అప్పటి దాకా జరగని మార్కెటింగ్ ఆ ఒక్క ఈవెంట్తో జరిగిపోతుంది. బట్.. దాన్ని ఒడిసిపట్టి, ప్లాన్ చేయడంలోనే ఎవరి కెపాసిటీ ఎంతో తేలుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానిది సూపర్ సక్సెస్. ఇప్పుడున్న ఫుట్బాల్ ఆటగాళ్లలో మెస్సీ తరువాతనే ఎవరైనా. అలాంటి వ్యక్తిని హైదరాబాద్కు రప్పిస్తోంది. ఇంతకీ మెస్సీ...
ఈ నెల 12వ తేదీ రాత్రికి మెస్సీ కోల్కతాకు చేరుకుంటాడు. 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ‘ది గోట్’ హైదరాబాద్కు చేరుకుంటాడు. అతడితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది బృందం హైదరాబాద్కు వస్తుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. మెస్సీ వసతి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఆరోజు సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటాడు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్ స్టేడియంలో ‘మెస్సీ మాయ’ అలరించనుంది. తొలుత సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు రేవంత్రెడ్డి..మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివర్లో మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆరోజు రాత్రి మెస్సీ నగరంలోనే బస చేసి మర్నాడు ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరతాడు. ‘ది గోట్ ఇండియా టూర్’ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ట్యాగ్లైన్. హైదరాబాద్లో 13వ తేదీన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం అమితాసక్తి కనబరుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

