Sports: ఆ రోజు నుంచి అన్నం ముట్టని తల్లి..: యష్ దయాల్ తండ్రి
Sports: "ఇది ఒక పీడకల, నా భార్యను ఓదార్చలేకపోతున్నాం. మ్యాచ్ తర్వాత అన్నం తినడం మానేసింది" అని యష్ దయాల్ తండ్రి చంద్రపాల్ దయాల్ జాతీయ మీడియాకు చెప్పారు. "ఇవి క్రీడలలో సర్వసాధారణం. జీవితంలో మీరు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ, బలంగా నిలబడటం చాలా ముఖ్యం" అని యస్ దయాళ్ తండ్రి చంద్రపాల్ అన్నారు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు యశ్ దయాల్ మరియు అతని కుటుంబం ఆ రోజు జరిగిన సంఘటనను మరిచిపోలేకపోతున్నారు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడమచేతి వాటం ఆటగాడు స్టేట్ మేట్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లతో చెలరేగిపోయాడు. మ్యాచ్ అనంతరం జరిగిన పరీక్షను యష్ దయాళ్ తండ్రి వివరిస్తూ.. ఇదో భయంకరమైన అనుభవం అని అన్నారు. "ఇది ఒక పీడకల, నా భార్యను ఓదార్చలేకపోతున్నాం. మ్యాచ్ తర్వాత తినడం మానేసింది" అని చంద్రపాల్ దయాల్ తెలిపారు.
కానీ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు ఇతర సహచరులు పరిస్థితిని అధిగమించడానికి యష్కు సహాయం చేశారని అన్నారు. జట్టు యష్ను ఒంటరిగా వదిలిపెట్టలేదని, తనను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించిందని చెప్పారు. తిరిగి హోటల్లో, KKR తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ నాయకత్వం వహించినందున అనారోగ్యంతో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో సహా ప్రతి జట్టు సభ్యుడు అతనికి కంపెనీ ఇచ్చారు. "వారు అతనిని సెంటర్లో కూర్చోబెట్టి, ఓదార్చారు. తరువాత, నాచ్-గానా (నృత్యం, సంగీతం) వంటివి చేస్తూ అతడిని ఉత్పాహపరిచారు. వారు అతడి బాధన తేలికపరచడానికి ప్రయత్నించారు అని అతని తండ్రి చెప్పారు. యష్ బంతిని సరిగ్గా పట్టుకోలేకపోయాడని, రింకూ బౌలింగ్ శైలితో పరిచయం ఉండటం కూడా ప్రతికూలంగా మారిందని చంద్రపాల్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com